ఘనంగా నీటితల్లమ్మ పండగ

73చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ జోగినాధునిపాలెంలో మంగళవారం నీటితల్లమ్మ అమ్మవారు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులు చేత ప్రత్యేక కోలాటం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్