ప్రమాదం వివరాలు తెలుసుకున్న జడ్పిటిసి

54చూసినవారు
గొలుగొండ మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేట గ్రామంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదంలో ఇద్దరు రైతులకు చెందిన రెండు పశువుల పాకలు దగ్ధమైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న గొలుగొండ జడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు మంగళవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీటీసీ లెక్కలు అప్పలనాయుడు, ఉప సర్పంచ్ కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్