ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ లో పాల్గోనున్న అరకు విద్యార్ధులు
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఈ నెల 25 నుంచి 31 వరకు జరిగిన 15 ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలకు చెందిన 17మంది విద్యార్ధిని, విద్యార్థులు హాజరవుతున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపాల్స్ డా. కె భరత్ కుమార్ నాయక్, డా. సిహెచ్ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వలన విద్యార్థులకు దేశంలో ఉన్న వివిధ గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతులపై అవగాహన కలుగుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.