విశాఖ-కిరండోల్‌ మధ్య మరో విస్టోడమ్‌

68చూసినవారు
విశాఖ-కిరండోల్‌ మధ్య మరో విస్టోడమ్‌
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ-కిరండోల్‌కు అదనంగా మరో విస్టోడమ్‌ కోచ్‌తో పాటు థర్డ్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈనెల 14వతేదీ, 21, 28 తేదీలో రైలు నం. 08551 విశాఖపట్నం-కిరండూల్ రైలుకు జోడించినట్టు తెలిపారు. తిరుగు దిశలో అదనపు విస్టాడోమ్ కోచ్ 08552 కిరండూల్-విశాఖ రైలుకు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్