గురువారం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో తోపుడు బండ్లు తొలిగించే ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారు. తమ పై నుంచి ఎక్కించి బళ్ళు తీసుకోండని బైటాయించారు. వార్డు వైసీపీ నేత పీతలగోవింద్ సంఘటన స్థలానికి చేరుకునిజీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందనలో పిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటున్నామని తెలపగా వ్యాపారులు మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.