బూర్జ గ్రామంలో ఘనంగా విత్తనాల పండుగ
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా భావించే గిరిజనులు తమ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఏటా వేరు వేరు సమయాల్లో నిర్వహించే విత్తనాల పండుగ (మండ్రుకియ) హుకుంపేట మండలంలోని బూర్జలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఏడాది వేసే పంటలు బాగా పండాలని పశుసంపద అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో తమ ఆరాధ్య దైవానికి కోడి కోసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నారు. అనంతరం గిరిజనులంతా కలిసి థింసా నృత్యం ప్రదర్శిస్తూ సందడి చేశారు.