అనారోగ్యంతో బాధపడుతూ ఏఎస్ఐ మృతి

77చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతూ ఏఎస్ఐ మృతి
హుకుంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మఠం పంచాయతీ పరిధి జాకరవలసకి చెందిన పాంగి. చిన్నయ్య ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. దీనితో మఠం పంచాయతీ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు ఏఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బంధువులు కోరారు.

సంబంధిత పోస్ట్