సర్వసిద్ధి హాస్పటల్ వద్ద వరల్డ్ ఆస్త్మా డే పై అవగాహన ర్యాలీ
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్ ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్ ఆస్త్మా డే పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసంతి మాట్లాడుతూ ఈ ఆస్త్మా రావటానికి ముఖ్యంగా వంశపారంపర్యంగా, వాతావరణ కాలుష్యo, దీర్ఘకాలిక జలుబు, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఆహార పదార్థాలలో రసాయనాల వల్ల ఆస్త్మా వస్తుందన్నారు.