జగన్ కి ప్రజా సమస్యలు పట్టవా?

56చూసినవారు
జగన్ కి ప్రజా సమస్యలు పట్టవా?
మాజీ సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం అభిమానం లేదని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి ఉపాధ్యక్షులు పోతనరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించే ఉద్దేశ్యం జగన్ అండ్ కో కి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఓట్లతో గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లకుండా అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలోనే శాంతి భద్రతలు క్షీణించాయన్నారు.

సంబంధిత పోస్ట్