
విశాఖ: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్
ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విశాఖలో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. గతంలో విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు మాత్రమే అనుమతి ఉండేది.