వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ఫోర్స్ పోలీసు లు చెక్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఆదివారం రాత్రి గోపాలపట్నంలో టాస్క్ఫోర్స్ పోలీసు లు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేపట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.