

విశాఖ: పదో తరగతి పరీక్షలు ప్రారంభం
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 60 వార్డు సరస్వతీ విద్యా విహార్ , భాష్యం ప్రైవేటు పాఠశాల దగ్గర 10వ తరగతి పరీక్షల కోలాహలం నెలకుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్ దబెస్ట్ చెబుతూ పరీక్ష కేంద్రంలోకి పంపారు. సరస్వతి పాఠశాలలో 200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.