2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటాం: మంత్రి అనిత

68చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమోన్మాది హ‌త్య చేయ‌డం బాధాకరమ‌ని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. "నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటాం. బాలిక హత్య వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం." అని మంత్రి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్