వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అని చంద్రబాబు అన్నారు. "మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్. అలాగే యువతకు ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదు. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకి ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం." అని ఆయన హామీ ఇచ్చారు. సీపీఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తానన్న జగన్ హామీ నెరవేరిందా? అని ప్రశ్నించారు.