బాడవ గ్రామంలో ఉచిత పశువుల దాణా పంపిణీ

85చూసినవారు
యలమంచిలి మండలం తీర ప్రాంత గ్రామాల్లో ఒకటైన బాడవ గ్రామంలో బుధవారం ఉచిత పశువుల దాణా ను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడి శెట్టి పెద్దిరాజు మాట్లాడుతూ యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో, ముంపు బాధిత గ్రామాలకు పశువుల దాణాను, ఉచితంగా అందజేయడం ఇది రెండవ సారి అన్నారు. కడలి గోపాలరావు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్