నవోదయ ప్రవేశాలకు 30 వరకు గడువు

60చూసినవారు
నవోదయ ప్రవేశాలకు 30 వరకు గడువు
ఏలూరు జిల్లా పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీతాలక్ష్మి గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ బోనఫైడ్ నివాసులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 30 వరకు గడువుందన్నారు.

సంబంధిత పోస్ట్