పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులో ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ. కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం తుది వరకు పోరాడారని అన్నారు.