ఇసుక రీచ్ లను పరిశీలించిన ఎమ్మెల్యే

54చూసినవారు
ఏలూరు జిల్లా కుకునూరు మండలం వింజరం గ్రామంలో సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచ్‌లను జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్వితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుక విధానంపై జీవో ఇచ్చిన వెంటనే అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్