May 10, 2024, 14:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఘనంగా పరుశురాం జయంతి వేడుకలు
May 10, 2024, 14:05 IST
రాజస్థాన్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో పరుశురామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ లోని సమాజ్ భవన్ వద్ద చేపట్టిన కార్యక్రమానికి పెద్దఎత్తున సమాజ్ కులస్తులు, మహిళలు తరలివచ్చారు. పరశురాం భారీ చిత్రపటాన్ని ట్రాక్టర్ లో ఉంచి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలందరూ పసుపు రంగు దుస్తులు, కాషాయపు రంగు తలపాగాలు ధరించి శోభయాత్రలో పాల్గొన్నారు. సమాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.