భర్తను చంపిన భార్య (వీడియో)

73చూసినవారు
ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మారుతినగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నిన్న రాత్రి అతని భార్య సుబ్రహ్మణ్యంపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్