19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?

59చూసినవారు
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి.. 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్స్‌లను జారీ చేసి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించనుంది. కాగా, వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో మద్యం షాపులు ఉండగా.. ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్