ఏలూరు కాలువకు గండి

73చూసినవారు
ఏలూరు కాలువకు గండి
కాకినాడ జిల్లాకు మరో టెన్షన్ పట్టుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ధాటికి మాకవరం మండలం రాచపల్లి వద్ద కాలువకు గండి పడింది. 10 అడుగుల మేర గట్టు తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. గండి పూడ్చివేతకు చర్యలు చేపట్టారు. గండి పడిన చోట ప్రొక్లెయిన్లతో ఇసుక, మెటల్ మూటలను వేస్తున్నారు. రెండు, మూడు గంటల్లో గండి పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్