విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసు ప్రారంభం (వీడియో)

65చూసినవారు
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. అయితే ఎయిర్‌పోర్టులో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్