కర్రలతో వంతెన ఏర్పాటు చేసిన గిరిజనులు (వీడియో)

63చూసినవారు
అల్లూరి జిల్లాలో మాదిమల్లు గిరిజనుల ఆవేదన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాల కారణంగా గుమ్మరేవుల పంచాయతీ మాదిమల్లు వంతెనకు ఇరువైపులా ఉన్న రహదారి వరదకు కొట్టుకుపోయింది. అయితే ఓ గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో గిరిజనులు కర్రలతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. గర్భిణీని వాగు దాటించి అంబులెన్స్ ద్వారా సీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వంతెనపైనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్