సీఎం
జగన్ ఐదేళ్ల పాలన ఓ పీడ కల అని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత ఇసుక అందిస్తానని, యువతకు 20 లక్షల
ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేది NDA ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు.