దేశంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు సీజేఐ చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి కోర్టులకు, రాజ్యాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ పిలుపునిచ్చారు. న్యాయవాదుల సంఘాల సభ్యులుగా న్యాయవాదులు కోర్టు తీర్పులపై ఇష్టానుసారంగా స్పందించవద్దని సూచించారు.