వాంతులు, విరేచనాలతో మహిళ మృతి

59చూసినవారు
వాంతులు, విరేచనాలతో మహిళ మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందింది. రెండ్రోజుల కిందట వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విజయమ్మ.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మరోవైపు అతిసారం ప్రబలడంతో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో అతిసారం వ్యాప్తి చెందడంతో పలుకూరు పీహెచ్‌సీ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్