వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదివారం భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ను కలిసినట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం.