పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

78చూసినవారు
పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో గురువారం పార్టీ నేతలతో ఆయన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘అధికారం ఈ రోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. పార్టీ నేతలు బూత్ కమిటీలపై ఫోకస్ చేయాలి. జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని నేతల పనితీరు ఆధారంగానే వారికి పార్టీలో ప్రమోషన్లు ఉంటాయి. నేతల పనితీరుపై పరిశీలన, మానిటరింగ్ ఉంటుంది.’ అని అన్నారు.