సీఎం జగన్‌పైకి రాళ్లు దాడిని ఖండించిన రెడ్యం

562చూసినవారు
మైదుకూరు నియోజకవర్గ వైసిపి సీనియర్ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శనివారం విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్యగా ఖండించారు.