త్రివిధ దళాల్లో ఉమ్మడి కార్యాచరణ రూపొందించే దిశగా జాయింట్ కల్చర్ సృష్టించాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. మేజర్ జనరల్ సమీర్ సిన్హా 22వ మెమోరియల్ లెక్చర్లో ఆయన ప్రసంగించారు. సాయుధ దళాల్లో ఉమ్మడి సంస్కృతిని అభివృద్ధి చేయడానికి ‘జాయింట్ నెస్ 2.O’ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన చేసిందన్నారు.