కాజీపేట పోలీస్ వారి హెచ్చరిక
ఖాజీపేట మండలంలోని ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీల వారికి కాజీపేట మండల పోలీసులు శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పోస్ట్ పోల్ (ఎలక్షన్ తరువాత) జరుగు సంఘటనలు దృష్టిలో పెట్టుకొని గొడవలు పెట్టుకొని కొట్టుకుంటే వారిపై నాన్ బెయిలబుల్ కేస్ లు రిజిస్టర్ చేసి వెంటనే రిమాండ్ కు తరలిస్తామన్నారు. ఎదైన సమస్యలు వుంటే పోలీసు స్టేషన్ ను సంప్రదించాలన్నారు.