గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ముఠా కొట్టేసిన భూముల విలువ రూ.36 వేల కోట్లు అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని సీఎం తెలిపారు. 'ఇళ్ల స్థలాలకు గుడివాడలో 256 ఎకరాలను రూ.185 కోట్లకు, కేసరపల్లిలో 73 ఎకరాలను రూ.51 కోట్లకు కొన్నారు. ఇది మార్కెట్ ధర కంటే 5 రెట్లు ఎక్కువ. మడ అడవులను కూడా ధ్వంసం చేయాలని చూశారు' అని చంద్రబాబు ఆరోపించారు.