చేప ప్రసాదం పంపిణీకి 10వేల మందికి టోకెన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. టోకెన్లపై ఇచ్చిన టైమ్ స్లాట్ ప్రకారం పంపిణీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. టోకెన్లను గ్రీన్, రెడ్, వైట్, బ్లూగా విభజించారు. వ్యాధిగ్రస్థులకు ఇబ్బందులు కలగకుండా తొలిసారి టైమ్ స్లాట్లు కేటాయించారు. వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబసభ్యులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో బేగంబజార్లోని మాలి భవన్లో మూడు వేల మందికి వసతి, ఆహారం కల్పించారు. శనివారం 30 వేల మందికి ఆహారం అందించనున్నిరు.