111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం: హైడ్రా

78చూసినవారు
111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం: హైడ్రా
జీహెచ్ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా బుధవారం వెల్లడించింది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. చెరువుల పరిరక్షణ కోసం, ప్రజలను విపత్తుల నుంచి కాపాడడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని 2024 జులైలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు.

సంబంధిత పోస్ట్