తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగష్టు నుంచి నవంబర్ వరకు 1,300 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. ఎస్ఐబీ కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కూడా నిలిపివేసినట్లు, బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల ఫోన్లే ట్యాప్ అయినట్లు వినిపిస్తోంది. అధికారులు ఫోన్ ట్యాప్ బాధితుల వాంగ్మూలం తీసుకుంటున్నట్లు సమాచారం.