రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు ఆకతాయి యువకులు ప్రయత్నించారు. రైలు పట్టాల సమీపంలోని కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడి, కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్లో ఈ సంఘటన జరిగింది.