మల్టీ విటమిన్ మాత్రలు మరణానికి ముప్పు!

77చూసినవారు
మల్టీ విటమిన్ మాత్రలు మరణానికి ముప్పు!
ప్రతిరోజూ మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవడం ఆయుష్షు పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కారణం కావొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏండ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు ఉపయోగపడటం లేదని, మరణ ముప్పును ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఇవి తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు తేల్చారు.

సంబంధిత పోస్ట్