రహదారులు నాగరికతకు చిహ్నాలు. అవి బాగుంటే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలమయమే. కొన్ని చోట్ల తారు లేచి మట్టి రోడ్లుగా దర్శనమిస్తున్నాయి. మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు.