లోక్సభలో తన ప్రసంగంలో హిందువులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవమానించారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అన్నారు. జైపూర్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను కించపరచడం, నిర్దిష్ట వర్గాన్ని మభ్యపెట్టడం రాహుల్కి అలవాటుగా మారిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసిన మొదటి ప్రసంగం అబద్ధాలు, నిరాశతో కూడి ఉందన్నారు.