నీటి ఎద్దడి కారణంగా బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృథా చేస్తే రూ.5 వేల వరకూ ఫైన్ వేస్తామని నీటి సరఫరా బోర్డు ప్రకటించింది. కార్ వాషింగ్, గార్డెనింగ్ ఇతర అవసరాల పేరుతో నీటిని వృథా చేయొద్దని హెచ్చరించింది.