త్వరలో అందుబాటులోకి రానున్న ఎయిర్ టాక్సీలు: ప్రధాని నరేంద్ర మోదీ

71చూసినవారు
త్వరలో అందుబాటులోకి రానున్న ఎయిర్ టాక్సీలు: ప్రధాని నరేంద్ర మోదీ
పౌర విమానయానంపై న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో పీఎం నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'అధునాతన వాయు రవాణా కోసం ప్రభుత్వం, దేశాన్ని సిద్ధం చేస్తోంది. ఎయిర్ టాక్సీలు త్వరలో అందుబాటులోకి వస్తాయి" అని మోదీ అన్నారు. పెరుగుతున్న మధ్యతరగతి వర్గం ప్రజలే పౌర విమానయాన రంగానికి చోదక శక్తి అని, ఆకాశ మార్గం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేయాలని ప్రధాని సూచించారు.

సంబంధిత పోస్ట్