బ్యాంకు సిబ్బందిని గన్స్‌తో బెదిరించి 50 లక్షలు చోరీ (వీడియో)

69చూసినవారు
బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం శ్రీకృష్ణ చౌక్‌లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌ లోకి సుమారు 12 మంది ముసుగు దొంగలు ప్రవేశించారు. గన్స్‌ చూపించి బ్యాంకు సిబ్బంధిని బెదిరించారు. వారిని ఒక చోట బంధించారు. అనంతరం బ్యాంకులోని రూ.50 లక్షలు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా పారిపోయే ముందు ఓ మహిళా కస్టమర్ వద్ద ఉన్న బ్యాగును కూడా లాక్కొనిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you