కాకతీయ విశ్వవిద్యాలయంలోని పద్మాక్షి హాస్టల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టళ్ల చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, పొదలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని భయాందోళనలకు గురవుతున్నారు. పోతన హాస్టల్ భవనం దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించినది కావడంతో గదుల్లో పెచ్చులు ఊడిపడుతున్నాయి. గ్రంథాలయం.. వంద మంది వస్తే చాలు కిక్కిరిసిపోతోంది. విద్యార్థులే సొంతంగా కుర్చీలు తెచ్చుకోవాల్సి వస్తోంది.