TG: రాష్ట్రంలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ ఇప్పిస్తామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక కేకేలు వేసింది. యువకులు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.