TG: కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. సంగారెడ్డి పటాన్చెరులో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. విచారణ మార్చి 5కి వాయిదా పడింది.