సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25% పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో నమోదైన లోక్సభ ఎన్నికల పోలింగ్ 76.5 శాతంగా, తెలంగాణలో 64.74 శాతంగా ఉంది. ఇక.. బిహార్లో 57.06% జార్ఖండ్లో 65.2%, మధ్యప్రదేశ్లో 70.98%, మహారాష్ట్రలో 59.64%, ఒడిశాలో 73.97%, ఉత్తరప్రదేశ్లో 58.05% ఓటింగ్ నమోదైంది.