అసెంబ్లీ ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతోనే జమ్మూలో ఉగ్రదాడులు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పాక్ ఆగడాలకు చెక్ పడడంతోనే టెర్రరిస్టులు జమ్మూపై దృష్టి పెట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో ఉన్నంత ఇంటెలిజెన్స్, భద్రత జమ్మూలో లేదని, అందుకే టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, దాడులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.