తెలంగాణలో ఈ ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, ములుగు, గద్వాల, యాదాద్రి,రంగారెడ్డి, నారాయణపేట, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో కొత్త కాలేజీలను ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 34కి చేరుకోనుంది. ఇప్పటికే అన్ని కళాశాలల్లో అధ్యాపక నియామకాలు పూర్తి కాగా, స్టాఫ్ నర్స్ సహా మరికొన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.