AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,105 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు.